Guntur Kaaram Mass Update Was Mind Blowing:- సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీలో చాలా ఏళ్ళ తరువాత మహేష్ బాబు మంచి మాస్ పాత్ర చేస్తుండగా హీరోయిన్స్ గా యువ అందాల నటీమణులు శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తుండగా హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో భారీ వ్యయంతో నిర్మిస్తోంది.
రాక్ స్టార్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుండి మొదట రిలీజ్ అయిన మాస్ పోస్టర్స్, మాస్ స్ట్రిక్ గ్లింప్స్ అలానే దమ్ మాసాల సాంగ్, ఓ మై బేబీ సాంగ్ ఇలా అన్ని కూడా ఆడియన్స్ ని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకుని మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచాయి. రమ్యకృష్ణ, జయరాం, ప్రకాష్ రాజ్, సునీల్, హైపర్ ఆది, బ్రహ్మానందం, మహేష్ ఆచంట వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి మనోజ్ పరమహంస ఫోటోగ్రఫి అందిస్తున్నారు.
Guntur Kaaram Mass Update Was Mind Blowing
అయితే గుంటూరు కారం (Guntur Kaaram) మూవీలో మూడవ సాంగ్ అయిన మాస్ సాంగ్ కి సంబంధించి నిర్మాత సూర్యదేవర నాగవంశీ కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ లో ఒక పోస్టర్ పెట్టారు. ఇప్పుడే మహేష్ బాబు గారు, శ్రీలీల గార్ల మాస్ డ్యాన్సింగ్ నంబర్ చూసాను, రేపు థియేటర్స్ లో అదిరిపోవడం ఖాయం, మన మాస్ భాషలో చెప్పాలంటే కుర్చీ మడతేసి కొడితే అంటూ ఆయన పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేస్తోంది.
Guntur Kaaram Mass Update Was Mind Blowing
దానితో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల ల మాస్ డ్యాన్సింగ్ పోస్టర్ ని కూడా జత చేసారు. ఈ పోస్టర్ లో మహేష్ బాబు, శ్రీలీల ఇద్దరూ కూడా డ్యాన్స్ అదరగొట్టడం చూడవచ్చు. ఇక లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ ప్రకారం ఈ మాస్ సాంగ్ ప్రోమోని డిసెంబర్ 29న అలానే ఫుల్ లిరికల్ సాంగ్ వీడియోని డిసెంబర్ 30న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా అన్ని కార్యక్రమాలు ముగించి గుంటూరు కారం మూవీని జనవరి 12న విడుదల చేయనున్నారు.
మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి