Guntur Kaaram Story Was Shocking:- సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మితమవుతున్న తాజా మాస్ యాక్షన్ ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గుంటూరు కారం. ఈ మూవీ పై మొదటి నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు గారి అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా విశేషమైన అంచనాలు ఉన్నాయి.
ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా కీలకపాత్రల్లో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, రఘుబాబు, సునీల్, హైపర్ ఆది, బ్రహ్మానందం వంటి వారు నటిస్తున్నారు. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న గుంటూరు కారం మూవీ నుంచి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు రెండు సాంగ్స్ అందర్నీ విశేషంగా ఆకట్టుకోగా నేడు ఈ మూవీ నుంచి మూడో సాంగ్ అయిన కుర్చీ మడతపెట్టి యొక్క ప్రోమోని రిలీజ్ చేయగా దానికి అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ లభిస్తోంది.
Guntur Kaaram Story Was Shocking
రేపు ఈ సాంగ్ యొక్క ఫుల్ లిరికల్ వీడియోని విడుదల చేయనున్నారు. అయితే గుంటూరు కారం మూవీ యొక్క స్టోరీ ఇదే అంటూ తాజాగా ఒక న్యూస్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. దాని ప్రకారం ఈ మూవీలో విడిపోయినటువంటి తల్లితండ్రులు కలిపేందుకు సిద్ధమైన కొడుకు సిద్దమవడం, తండ్రి కుటుంబం రాజకీయాల్లో ఉండటం ఇష్టంలేని తల్లి కొడుకుని కూడా రాజకీయాల్లోకి వెళ్లొద్దనటం అలానే కొడుకుకి కూడా రాజకీయాలు ఇష్టం లేకపోవడం వంటి ఇంట్రెస్టింగ్ కథాంశంతో గుంటూరు కారం మూవీ తెరకెక్కినట్టు తెలుస్తోంది.
Guntur Kaaram Story Was Shocking
సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా సంవత్సరాల తరువాత ఊరమాస్ పాత్ర చేస్తున్న ఈ మూవీ పై అందరిలో వున్న అంచనాలు ఖచ్చితంగా అందుకుని విడుదల తరువాత గుంటూరు కారం మూవీ బాక్సాఫీస్ దగ్గర అతిపెద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని, 12 ఏళ్ళ తర్వాత మహేష్ తో త్రివిక్రమ్ ఈ మూవీలో అద్భుతమైన మాస్ యాక్షన్, కామెడీ సన్నివేశాలు, పవర్ ఫుల్ డైలాగ్స్ సూపర్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఆకట్టుకుంటాయని మేకర్స్ తో పాటు యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. మరి 12 ఏళ్ళ విరామం తర్వాత మహేష్ త్రివిక్రమ్ కలిసి చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ గుంటూరు కారం మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అనంతరం ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి