బోధపురం చర్చిలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
– కేక్ కట్ చేసి సంబరాలు
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని బోధపురం గ్రామంలో ఉన్నటు వంటి ఏసు క్రీస్తు ప్రార్ధన మందిరంలో నూతన సంవత్సర వేడుకలు పాస్టర్ కర్ని లూకా ఆధ్వర్యంలో ఘణంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా పాస్టర్ లుకా మాట్లాడుతూ నూతన సంవత్సరం అందరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని 2023 సంవత్స రంలో దేవుడు కాపాడి మంచి ఆరోగ్యం ఇచ్చారని, 2024 సంవత్స రంలో కూడ యేసుక్రీస్తు దీవెనలు ఉండాలని రాష్ట్ర ప్రజలకు జిల్లా ప్రజలకు మండ ప్రజలను దేవుని యొక్క దీవెనలు ఉండాలని సందేశం ఇచ్చారు. అనంతరం నూతన సంవత్సర కేకు కట్ చేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి, వేడుకలు జరుపు కున్నారు. ఈ కార్యక్రమంలో ,పాస్టర్ లూకా, సంఘ పెద్దలు ఇస్సాకు దానియేలు, నరేష్ మహిళలు, పిల్లలు, గ్రామ పెద్దలు, అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.
1 thought on “బోధపురం చర్చిలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు”